
ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికలోని కీలకమైన మూడు అంశాలకు మంత్రిమండలిలో ఆమోదించి, శాసనసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున అభినందనలు తెలియజేశారు.
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ గారితో పాటు ఎస్సీ సామాజిక వర్గ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారిని వారి చాంబర్లో కలిసి అభినందనలు తెలియజేశారు.