spot_img
spot_img
HomePolitical Newsత్రిషకి కోటి రూపాయలు నజరానా ఇచ్చిన CM

త్రిషకి కోటి రూపాయలు నజరానా ఇచ్చిన CM

మహిళల అండర్ -19 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష గారికి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి గారు అభినందించారు.

కుటుంబ సభ్యులతో కలిసి గొంగడి త్రిష జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.

త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు అలాగే, అండర్ -19 ప్రపంచ కప్ టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ గారికి, ట్రైనర్ షాలిని గారికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష గారు కలిసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, పలువురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి గారితో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments