spot_img
spot_img
HomeFilm NewsBollywoodసూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో విశాల్, అంజలి మరోసారి జంటగా రాబోతున్న కొత్త సినిమా త్వరలో...

సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో విశాల్, అంజలి మరోసారి జంటగా రాబోతున్న కొత్త సినిమా త్వరలో ప్రారంభం.

తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) మరియు అంజలి (Anjali) జంట ఈ ఏడాది విడుదలైన మద గజ రాజా (Madha Gaja Raja) సినిమాలో కనిపించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో మేకర్స్ విశాల్ 35వ చిత్రంలోనూ అంజలిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి (RB Chowdary) తమ సూపర్ గుడ్ ఫిలిమ్స్ (Super Good Films) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో ఇది 99వ సినిమా కావడం విశేషం.

ఈ చిత్రంలో ఇప్పటికే దుషారా విజయన్ ప్రధాన నాయికగా నటిస్తోంది. తంబి రామయ్య, అర్జై వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా అంజలి కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. విశాల్, అంజలి జంట గతంలో చూపించిన కెమిస్ట్రీ అభిమానుల్లో ప్రత్యేకంగా నిలిచింది.

జూలైలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగగా, ఆగస్ట్ 1న తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఊటీలో సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లోనే అంజలి కూడా టీమ్‌తో జతకలిసింది. ఈ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహిస్తుండగా, మద గజ రాజా ఫేమ్ రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

అలాగే, విశాల్ మార్క్ ఆంటోనీకి మ్యూజిక్ అందించిన జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నాన్ స్టాప్ షెడ్యూల్‌లో ఈ సినిమాను 45 రోజుల్లో పూర్తిచేయాలని మేకర్స్ నిర్ణయించారు.

మద గజ రాజా సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని, విశాల్-అంజలి జంటపై మళ్లీ పెద్ద అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంటారా అన్నది చూడాలి.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments