spot_img
spot_img
HomeSpecial Storiesరాజయోగిని దాది రతన్ మోహినీ జీ గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

రాజయోగిని దాది రతన్ మోహినీ జీ గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదర్శవంతమైన దాది జీ గారి జీవితం ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. వారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా, మార్గదర్శిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు.

దాది జీ గారు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో విస్తరింపజేసి, సమాజానికి శాంతి, మానవతా విలువల సందేశాన్ని అందించారని గుర్తుచేసుకున్నారు. దాది జీ గారి మృతి రాష్ట్రానికి, దేశానికి, ఆధ్యాత్మిక విశ్వానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. దాది రతన్ మోహినీ జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments