spot_img
spot_img
HomeFilm NewsBollywoodరణబీర్, సాయిపల్లవి నటించిన ‘రామాయణం’ టీజర్ త్వరలో విడుదల కానుందని సమాచారం.

రణబీర్, సాయిపల్లవి నటించిన ‘రామాయణం’ టీజర్ త్వరలో విడుదల కానుందని సమాచారం.

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘రామాయణం’. ఈ పౌరాణిక చిత్రం దర్శకుడు నితేష్ తివారీ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ‘రామాయణం పార్ట్ 1’ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సెట్స్‌లో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం, రామాయణం మూవీ నుంచి బిగ్ అప్డేట్ రాబోతోందట. బెంగళూరులో గ్రాండ్‌గా ‘రామాయణం లోగో లాంచ్’ ఈవెంట్ నిర్వహించనున్నారు. అదే వేదికపై టైటిల్ టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ ఈవెంట్ జూలై 3న జరగనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ టీజర్ రిలీజ్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆ స్కేల్‌లో విజువల్ గ్రాండియరిటీ ఇవ్వడానికి వీఎఫ్ఎక్స్ కంపెనీ DNEG పని చేస్తోంది. ఇదే సంస్థ హాలీవుడ్‌కి కూడా అద్భుతమైన విజువల్స్ అందించింది. టీజర్ దాదాపు మూడు నిమిషాల నిడివితో రెడీ అయ్యిందని సమాచారం. ఇది పౌరాణిక సినిమాల్లో ఓ విజువల్ వండర్‌గా నిలవబోతోందని సినీ విశ్లేషకుల అంచనా.

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, లారా దత్త కైకేయిగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా కథను ఆధునిక తరానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ మహాపౌరాణిక చిత్రాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. రెండో భాగాన్ని 2027 దీపావళికి తెరపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారతీయ సినీ పరిశ్రమలో మైలురాయిగా నిలవనుంది.


Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments