spot_img
spot_img
HomePolitical NewsNationalప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాష్ట్రానికి ఐదు కీలక విజ్ఞప్తులు

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాష్ట్రానికి ఐదు కీలక విజ్ఞప్తులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ భేటీ గంటకు పైగా కొనసాగింది. సీఎం రేవంత్ రాష్ట్రానికి కేంద్రం నుంచి సమర్థవంతమైన సహాయాన్ని అందించాలని ప్రధానిని కోరారు.
 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగినన్ని కేటాయింపులు లేవని, రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ, రక్షణ రంగ ప్రాజెక్టులకు నిధులు అందించాలని ప్రధాని మోదీకి వివరించారు.

సీఎం రేవంత్ ప్రధాని మోదీ ముందు ఐదు ప్రధాన విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా, హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం రూ. 22,000 కోట్లు కేటాయించాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును త్వరగా అమలు చేయాలని, మచిలీపట్నానికి అనుసంధానం చేసేందుకు డ్రై పోర్ట్ నిర్మాణాన్ని అనుమతించాలని తెలిపారు. అదనంగా 29 మంది ఐపీఎస్ పోస్టులను మంజూరు చేయాలని, రక్షణ రంగ ప్రాజెక్టులను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సెమీ కండక్టర్ల తయారీ కోసం ప్రత్యేక ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయాలని, మూసీ నది పునరుద్ధరణకు రూ. 20,000 కోట్లు కేటాయించాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టత ఇచ్చారు. 2016-17, 2017-18 సంవత్సరాల్లో ఆవాస్ యోజన అమలు అంశం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మూడు ప్రధాన ప్రాజెక్టుల పురోగతిని ప్రస్తావించారు. అలాగే, దేవాదుల, బీమా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టాలని సూచించారు. బీబీ నగర్ ఎయిమ్స్, శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రి, రెండు ప్రధాన రైల్వే ప్రాజెక్టులపై కూడా ప్రధాని వివరణ ఇచ్చారు.

సీఎం రేవంత్ మాట్లాడుతూ, ఈ ఐదు కీలక విజ్ఞప్తులకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం అవసరమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి తమ బాధ్యతను నిర్వర్తించాలి అని సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందే బాధ్యత కిషన్ రెడ్డిదేనని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు లైఫ్ లైన్‌లుగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం అడ్డు పెట్టిన వ్యక్తి కిషన్ రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు మంజూరయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments