spot_img
spot_img
HomePolitical NewsAndhra Pradeshఒక రోజు గురువుగా మారిన సీఎం చంద్రబాబు, పదవ తరగతి విద్యార్థులకు సామాజిక శాస్త్రం బోధించారు.

ఒక రోజు గురువుగా మారిన సీఎం చంద్రబాబు, పదవ తరగతి విద్యార్థులకు సామాజిక శాస్త్రం బోధించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా  పెరెంట్-టీచర్ మీటింగ్  సమావేశం లో ఒక ప్రత్యేక సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ఒక రోజు టీచర్‌గా మారారు. పదవ తరగతి విద్యార్థులకు సామాజిక శాస్త్రం బోధిస్తూ విద్యా రంగానికి తన అపారమైన ప్రాధాన్యతను చాటారు. విద్యార్థుల బోధన కోసం ఆయన మొత్తం 45 నిమిషాల పాటు క్లాస్ నిర్వహించారు.

ఈ క్లాస్‌లో సీఎం చంద్రబాబు విద్యార్థులకు శక్తి వనరులు, పేటెంట్లు, ఆవిష్కరణలు వంటి ముఖ్యమైన విషయాలపై సులభంగా అర్థమయ్యేలా బోధించారు. విద్యార్థులతో ముఖాముఖిగా సంభాషిస్తూ, వారి సందేహాలను క్లియర్ చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. ఇదే ఓ నిజమైన నాయకుడి విశిష్టతను చాటింది.

ఈ సమయంలో మంత్రి నారా లోకేష్ గారు ఒక విద్యార్థిగా తరగతిలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని శ్రద్ధగా విని, నోట్సు తీసుకుంటూ విద్యార్థుల తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈ తరహా తరగతి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం, ప్రేరణ నింపింది.

ఇలాంటి కార్యక్రమాలు విద్యా రంగానికి మరింత బలాన్నిస్తాయి. ముఖ్యమంత్రి స్వయంగా టీచర్‌గా మారడం వల్ల విద్యా వ్యవస్థపై ప్రభుత్వ దృష్టి ఎంత గాఢంగా ఉందో స్పష్టమవుతోంది. విద్యార్థులకు ఇది మరపురాని అనుభవంగా మిగిలిపోతుంది. ఈ తరహా ప్రయత్నాలు కేవలం చదువు కోసమే కాదు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచడానికి దోహదపడతాయి. భవిష్యత్తులో ఈ తరహా వినూత్న కార్యక్రమాలు మరింత మందిని ప్రభావితం చేయాలని ఆశిద్దాం

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments