spot_img
spot_img
HomePolitical NewsNationalఐపీఎల్‌ లీగ్‌ దశను చెన్నై సూపర్ కింగ్స్‌ ఘన విజయంతో ముగించింది, గుజరాత్‌ను చిత్తు చేసింది.

ఐపీఎల్‌ లీగ్‌ దశను చెన్నై సూపర్ కింగ్స్‌ ఘన విజయంతో ముగించింది, గుజరాత్‌ను చిత్తు చేసింది.

ఐపీఎల్ లీగ్ దశను చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం తో ముగించింది గుజరాత్‌పై 83 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది

ఐపీఎల్ 2025 లీగ్ దశకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గట్టిగా ముగింపు పలికింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ (GT)పై చెన్నై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెన్నై 83 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదే మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసింది. ఐదుసార్లు చాంపియన్ అయినా ఈ సీజన్‌లో చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత పొందలేకపోయింది. కానీ ప్లేఆఫ్స్‌కి చేరిన జట్టును ఓడించడం ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు డెవాల్డ్ బ్రేవిస్ (57), డెవోన్ కాన్వే (52), ఆయుష్ మాత్రే (34), ఉర్విల్ పటేల్ (37) అద్భుత ఇన్నింగ్స్‌లతో తోడయ్యారు. అందువల్ల చెన్నై 20 ఓవర్లలో 230/5 పరుగులు చేసింది. ఇది ఈ సీజన్‌లో చెన్నైHighest స్కోరు కావడం విశేషం. మాత్రే, కాన్వే జోడిగా 44 పరుగులు చేసి ప్రారంభాన్ని ఇచ్చారు. అనంతరం బ్రేవిస్, జడేజా 74 పరుగుల భాగస్వామ్యం చెలరేగింది.

విపరీత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ ప్రారంభం నుంచే తడబాటుకు గురైంది. కెప్టెన్ గిల్ (13), బట్లర్ (5), రూథర్‌ఫోర్డ్ (0) లు వరుసగా ఔట్ కావడంతో గుజరాత్ పవర్‌ప్లేలోనే 35/3 తో కుదేలైంది. సుదర్శన్ (41), షారుఖ్ (19) ఓ రేంజ్‌లో పోరాడినా, జడేజా రెండు కీలక వికెట్లు తీసి గుజరాత్ ఆశలు చిదిమేశాడు.

బౌలింగ్‌లో చెన్నై ఆటగాళ్లు మెరిశారు. అన్షుల్ కాంబోజ్ (3/13), నూర్ అహ్మద్ (3/21), జడేజా (2/17) లు కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను కేవలం 147 పరుగులకే కట్టడి చేశారు. 18.3 ఓవర్లలో మొత్తం జట్టు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రేవిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో చెన్నై విజయవంతంగా లీగ్ దశ ముగించగా, గుజరాత్ ప్లేఆఫ్స్ ముందు షాక్ తిన్నట్టైంది. ఈ మ్యాచ్ అభిమానులకు పక్కా ఎంటర్టైన్‌మెంట్‌ను అందించింది.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments