spot_img
spot_img
HomeFilm NewsBollywoodఅజయ్ దేవగన్ కొత్త సినిమా కోసం ‘సు ఫ్రమ్ సో’ దర్శకుడు జేపీ తుమినాడుతో కలిసి...

అజయ్ దేవగన్ కొత్త సినిమా కోసం ‘సు ఫ్రమ్ సో’ దర్శకుడు జేపీ తుమినాడుతో కలిసి పనిచేయబోతున్నాడు.

బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో హిట్ సినిమాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సూపర్‌స్టార్ల ఆధిపత్యం ఉన్నప్పటికీ, ఇప్పుడు వరుస ఫ్లాప్స్‌తో ఇండస్ట్రీ పెద్ద ఇబ్బందుల్లో పడింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, హిట్ కోసం బాలీవుడ్ హీరోలు తహతహలాడుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా సౌత్ దర్శకుల వైపు బాలీవుడ్ దృష్టి మళ్లింది.

ఇప్పటికే అనేక సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్‌లో విజయవంతంగా తమ ముద్ర వేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే అట్లీ తెరకెక్కించిన జవాన్ షారుఖ్ ఖాన్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ విజయాల తర్వాత సౌత్ ఇండియన్ డైరెక్టర్లకు బాలీవుడ్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది.

తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా సౌత్ దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. కన్నడ బ్లాక్‌బస్టర్ *”సు ఫ్రమ్ సో”*తో సక్సెస్ సాధించిన జె.పి. తుమినాడు అజయ్‌కు కథ వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా హారర్ కామెడీ జానర్‌లో ఉండనుందని, పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు టాక్ ఉంది.

ఈ ప్రాజెక్ట్‌ను కెవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సంస్థ బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్‌లతో సినిమాలు రూపొందించింది. 2026 మొదటిార్థంలో ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్‌కు తీసుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్‌లో మూడో ప్రాజెక్ట్‌గా ఈ సినిమాకు విస్తృతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్ దర్శకులను ఆశ్రయించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఈ కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తే, ఇండస్ట్రీకి కొత్త ఊపుని తెస్తాయి. రాబోయే రోజుల్లో అజయ్ దేవగన్ సినిమా ఎంత సక్సెస్ అవుతుందో, బాలీవుడ్ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉండవచ్చు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments